కడెం మండలంలోని ధర్మాజీపేట గ్రామ శివారులో ఉన్న ప్రధాన రహదారిపై భారీ వర్షానికి చెట్టు పడిపోయింది. దీంతో ఆ మార్గంలో కొద్దిసేపు రాకపోకలు ఆగిపోయాయి. ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో కడెం మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో ధర్మాజీపేట శివారులో ఉన్న ప్రధాన రహదారిపై భారీ చెట్టు పడిపోవడంతో వాహనాల రాకపోకలు కాసేపు నిలిచిపోయాయి. స్థానికులు చెట్టును పక్కకు జరిపి రాకపోకలను పునరుద్ధరించారు.