సాహిత్య సామ్రాట్ అన్నా బావు సాటే అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ పలు సంఘాల నాయకులు కోరారు. సాటే జయంతిని పురస్కరించుకొని గురువారం సాయంత్రం ఉట్నూరు మండలంలోని హస్నాపూర్ గ్రామంలో ఉన్న సాటే విగ్రహానికి వారు పూలమాలలు వేసే నివాళులర్పించారు. తన సాహిత్యం ద్వారా అన్న బావు సాటే ప్రజలలో చైతన్యం తీసుకువచ్చారని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.