జన్నారం మండలంలోని చింతగూడ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీసి కెమెరాలు ఏర్పాటు కోసం చింతగూడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 25 వేల విరాళాన్ని అందజేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో పాఠశాల తో పాటు పిల్లలకు భద్రత ఉంటుందన్నారు. ఈ కార్యక్రమములో వైస్ ఎంపీపీ సుతారి వినయ్, చింతగూడ ఫౌండేషన్ సభ్యులు కస్తూరి దుబ్బయ్య, అరె సత్యం, అరె శిరీష్, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యయులు, విద్యార్థులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.