డీఎస్సీని వాయిదా వేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి వినతి పత్రం సమర్పించారు. గురువారం సాయంత్రం ఉట్నూర్ పట్టణంలోని కేబి కాంప్లెక్స్ లో నిర్వహించిన కార్యక్రమానికి వచ్చిన డిప్యూటీ సీఎం విక్రమార్కకు ఆమె వినతి పత్రం సమర్పించారు. డీఎస్సీకి అభ్యర్థులు ప్రిపేర్ అయ్యే సమయం లేదని, దీని దృష్టిలో పెట్టుకొని డీఎస్సీని వాయిదా వేయాలని భట్టి విక్రమార్కను ఆమె కోరారు.