కవ్వాల్ అభయారణ్యం పునరావాస కాలనీ ఆదివాసి ప్రజలకు మంచి వ్యవసాయ భూములు ఇచ్చేలా ప్రభుత్వంతో మాట్లాడతానని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నాయకురాలు సుగుణక్క అన్నారు. కడెం మండలంలోని కొత్త మద్దిపడగ పునరావాస కాలనీకి చెందిన ఆదివాసి ప్రజలు ఆమెను బుధవారం మధ్యాహ్నం ఉట్నూరు పట్టణంలో కలిశారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వంతో మాట్లాడి వారికి వ్యవసాయోగ్యమైన భూములు ఇచ్చే విధంగా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.