జన్నారం మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులకు మండల పశువైద్యాధికారి డాక్టర్ కస్తూరి శ్రీకాంత్ పశుగ్రాస విత్తనాలను అందజేశారు. బుధవారం మధ్యాహ్నం జన్నారం పట్టణంలోని పశు వైద్యశాల ఆవరణలో పలు గ్రామాల రైతులకు ఆయన పశుగ్రాస విత్తనాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశుగ్రాస విత్తనాలు కావాల్సిన రైతులు తమను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.