కడెం మండలంలోని ఉడుంపూర్ కు చెందిన నిండు గర్భిణి టేకం ముత్తుబాయి అంబులెన్స్లో ప్రసవించారు. ముత్తుబాయికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు జన్నారం 108 సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సిబ్బంది ఆమెను ఉట్నూర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో అంబులెన్స్ లోనే పండంటి మగ శిశువుకు ఆదివారం జన్మనిచ్చింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని టెక్నీషియన్ మునీందర్ గౌడ్, పైలట్ రఫిక్ వెల్లడించారు.