విద్యార్థులు, నేటి యువత ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగితే విజయం మన ముంగిట్లో ఉంటుందని ఖానాపూర్ మండలం మస్కాపూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బోనగిరి నరేందర్ రావు అన్నారు. గురువారం పాఠశాలలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఇదే పాఠశాలలో ఇంతకు ముందు పనిచేసి ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సాధించిన వారిని సన్మానించారు.