రానున్న పంచాయతీ ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరవేసేలా బిజెపి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథరావు సూచించారు. బుధవారం జన్నారం పట్టణంలోని బిజెపి కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి బాధాకరమని, బిజెపికి ఆయన చేసిన సేవలు మరువలేనివి అన్నారు. కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు మధుసూదన్ రావు, నాయకులు పాల్గొన్నారు.