స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయంతో పని చేద్దామని బిజెపి ఆదిలాబాద్ పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య, బిజెపి రాష్ట్ర నాయకులు రితేష్ రాథోడ్ అన్నారు. బుధవారం సాయంత్రం ఖానాపూర్ పట్టణంలోని పిఆర్టియు భవన్లో నిర్వహించిన ఖానాపూర్ మండల, పట్టణ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ప్రజల మేలు కోసం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పథకాలను అనేక అమలు చేస్తోందని, వాటి గురించి ప్రజలకు తెలపాలన్నారు.