మనిషి భవిష్యత్తుకు అడవులు, వన్యప్రాణులు కావాలని జన్నారం మండల ఎఫ్ఆర్ఓ సుష్మారావు సూచించారు. హైదరాబాద్ శివారులోని ఫారెస్ట్ అకాడమీకి చెందిన 36 మంది శిక్షణ ఎఫ్బిఓలు గురువారం జన్నారం మండలంలోని పలు అటవీ క్షేత్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారికి అభయారణ్యంలో పెంచుతున్న గడ్డి క్షేత్రాలు, వాటర్ పథకాలు, అడవులు, వన్యప్రాణుల రక్షణ చర్యల గురించి ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు పాల్గొన్నారు.