ఇల్లు పీకి పందిరి వేస్తున్న కోతులు

84చూసినవారు
ఇల్లు పీకి పందిరి వేస్తున్న కోతులు
ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్లో కోతుల బెడదతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోయారు. గ్రామంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కోతుల సంఖ్య పెరిగిందని, కనీసం బయటకు రాలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. కోతులు ఇళ్లపై సంచరిస్తూ పెంకులకు, రేకులకు నష్టం కలిగిస్తున్నాయని, ఇళ్లలోకి వచ్చి వస్తువులను చిందరవందర చేస్తున్నాయని వారన్నారు. అధికారులు కోతుల బెడద నుండి తమను కాపాడాలని మస్కాపూర్ గ్రామ ప్రజలు కోరారు.

సంబంధిత పోస్ట్