బీసీల మద్దతు ఉన్నవారే ప్రజా ప్రతినిధులుగా గెలుస్తారు

84చూసినవారు
బీసీల మద్దతు ఉన్నవారే ప్రజా ప్రతినిధులుగా గెలుస్తారు
బీసీ కులస్తుల మద్దతు ఉన్నవారే ప్రజా ప్రతినిధులుగా గెలుస్తారని బీసీ కులాల ఐక్య ఉద్యమ పోరాట సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరు చంద్రయ్య స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం జన్నారంలో ఆయన మాట్లాడుతూ చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లను పెంచాలని రెండు సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నామని, అయినా అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదన్నారు. తమకు మద్దతు ఇచ్చేవారికి ఓట్లు వేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్