ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో కురిసిన భారీ వర్షాలతో భూగర్భ జలాలు పెరిగి మంచినీటి బావులలో నీటిమట్టం పెరిగింది. చాలా గ్రామాలలో ప్రజలకు బావుల ద్వారానే మంచి నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ఆ బావులలో కొత్త నీరు రావడంతో తాగేందుకు పనికి రావడం లేదని ప్రజలు వాపోయారు. ఆ నీటిని తాగిన వారు డయేరియా, తదితర వ్యాధులతో బాధపడుతున్నారని, మంచినీటి బావులను క్లోరినేషన్ చేసి నీటిని సరఫరా చేయాలని వారు కోరారు.