ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకున్న టెన్త్ పూర్వ విద్యార్థులు 20 సంవత్సరాల తర్వాత మళ్లీ కలిశారు. ఆ పాఠశాలలో 2004-05 సంవత్సరంలో టెన్త్ చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఖానాపూర్ మండలంలోని ఎల్ఆర్ గార్డెన్స్ లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా నాడు తమకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం గత జ్ఞాపకాలను వారు గుర్తు చేసుకున్నారు.