సెల్ ఫోన్ చార్జింగ్ కేబుల్ నోట్లో పెట్టుకుని చిన్నారి మృతిచెందిన ఘటన గురువారం రాత్రి కడెం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం కడెం మండలంలోని కొత్త మద్ది పడగ గ్రామానికి చెందిన దుర్గం రాయలింగు సుశీల దంపతుల చిన్న కుమార్తె ఆరాధ్య తన ఇంట్లో సెల్ ఫోన్ ఛార్జింగ్ కేబుల్ నోట్లో పెట్టుకొని విద్యుత్ షాక్కు గురైంది. దీంతో కుటుంబీకులు ఆరాధ్యను ఖానాపూర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది.