బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారిని శుక్రవారం మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన పూజలు చేశారు. ఎమ్మెల్యే దంపతులకు ఆలయ అర్చకులు మదన్ దీక్షిత్ అమ్మవారి హారతి అందజేసి ఆశీర్వదించారు.