బాసర: ఒకేరోజు 1032 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం

75చూసినవారు
బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో
శనివారం మాఘ మాసం మృగ శిర నక్షత్రం
శుభదినం కావడంతో అమ్మవారి ఆలయానికి
భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో భారీగా
అక్షరాభ్యాస పూజలు నమోదయ్యాయి. మొత్తం 1032 మంది చిన్నారులు అక్షర శ్రీకారం జరిపించుకున్నారు. రూ. 1000 టోకెన్ తో 773, రూ. 150 టికెట్తో 259 చిన్నారులకు అక్షరాభ్యాసం జరిగింది. వివిధ పూజ టికెట్ల విక్రయాలతో మొత్తం రూ. 5. 13, 34, 430 ఆదాయం సమకురినట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్