భైంసా పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద బుధవారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వం నిరుపేదలైన తమకు డ్రా ద్వారా ఇళ్ల కోసం ఎంపిక చేసినప్పటికీ తమకు ఇప్పటివరకు ఇళ్లను కేటాయించలేదని రాస్తారోకో చేపట్టారు. వెంటనే తమకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. దింతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.