భైంసా పట్టణం కిసాన్ గల్లీ హనుమాన్ దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో రోక్డ హనుమాన్ ఆలయంలో హనుమాన్ పడి పూజ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామరావ్ పటేల్ పాల్గొని పూజలు నిర్వహించారు. గురుస్వామి కోర్వచిన్నన్న ఆధ్వర్యంలో జరిగిన పూజ మహోత్సవం కమనీయంగా కోనసాగింది. హనుమాన్ మాలధారులు పాడిన పాటలతో పూజ ఘట్టం రామనామ స్మరణ తో మారు మ్రోగింది. పట్టణ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.