భైంసా: పీఎం స్వనిధి ఫ్లకార్డు బోర్డులను అందించాలి

79చూసినవారు
పీఎం స్వనిధి ఫ్లకార్డు బోర్డులను లబ్ధిపొందిన చిరువ్యాపారులకు అందించాలని గురువారం బైంసా మున్సిపల్ కమిషనర్ రాజేష్ కు బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. కరోనా కష్ట కాలంలో పట్టణంలో 3వేల మంది చిరువ్యాపారులకు కేంద్రం ఈ పథకాన్ని వర్తింపజేసి రూ. 10వేల నుండి 50వేల వరకు లోన్స్ అందించిందన్నారు. దుకాణాల ముందు ఉంచవలసిన బోర్డులను లబ్ధిపొందిన వారికి అందించకుండా మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యం వహించారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్