నిర్మల్ జిల్లా భైంసా వ్యవసాయ మార్కెట్లో శనివారం నుండి మూడు రోజులు క్రయవిక్రయాలు జరగవని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హనుమాన్ జయంతి, ఆదివారం సెలవు దినం సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా భూసార బీట్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని రైతులు గమనించి సహకరించాలని కోరారు. మంగళవారం నుండి యధావిధిగా క్రయవిక్రయాలు జరుగుతాయని తెలిపారు.