కోల్కతాలో వైద్యురాలిని అమానుషంగా మానభంగం చేసి హత్య చేసిన నేరస్తులకు కఠిన శిక్ష విధించాలని డాక్టర్లు డిమాండ్ చేశారు. శనివారం భైంసా డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్స్ అసోసియేషన్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. బాధిత వైద్యురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ కోమల్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.