ముధోల్ కు చెందిన అంబులెన్స్ డ్రైవర్ గడ్డం సుభాష్ తన వంతు బాధ్యతగా గురువారం అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారికి మందులను పంపింణి చేశారు. డబ్బులు పెట్టి తీసుకోలేని పరిస్థితిలో ఉన్న వారికి వంద రోజులకు సరిపడే విధంగా మాత్రలు పంపిణీ చేశారు. తన వంతు బాధ్యతగా సామాజిక సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొంటానని వెల్లడించారు. వంద రోజులకు సరిపడా మందులు ఇవ్వడం పట్ల రోగులు ఆనందం వ్యక్తం చేశారు.