భైంసా మండలం ఎగ్గం గ్రామంలో ఆదివారం ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డా. నరేష్ ఆధ్వర్యంలో పిల్లల ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 100 మంది పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. పిల్లల తల్లిదండ్రులకు వర్షాకాలంలో వచ్చే రోగాల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.