భైంసా పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శనివారం ఓ బాలిక మృతి చెందింది.
కుబీర్ మండల కేంద్రంలోని పల్లవి(13) అనే బాలిక కడుపునొప్పితో బాధ పడగా కుటుంబీకులు ఆసుపత్రిలో చేర్పించారు. శుక్రవారం రాత్రి అపరేషన్ కాగా, శనివారం ఉదయం బాలిక మృతి చెందింది. వైద్యుడు నిర్లక్ష్యంతోనే బాలిక మృతి చెందిందని కుటుంబీకులు ఆరోపిస్తు ఆసుపత్రి ముందు నిరసన చేపట్టారు.