భైంసా మండలంలోని వానల్పాడు గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల, రైతు వేదిక కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ముందుగా తెలంగాణ తల్లి చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతకాన్ని ఎగుర వేసి జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, పంచాయతీ కార్య దర్శి అనితా, వ్యవసాయ విస్తరణ అధికారి, తదితరులు పాల్గొన్నారు.