నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల శుక్రవారం రాత్రి సిబ్బందితో కలిసి బాసర రైల్వే స్టేషన్, గోదావరి పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ లలో అనుమానాస్పద వ్యక్తులు, అనుమానాస్పద వస్తువులు, వాహనములు కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎఎస్పీ అవినాష్ కుమార్, ముధోల్ సిఐ మల్లేష్, ఎస్ఐ సంజీవ్, ఆర్. ఎస్ఐ లు, శివంగి టీం మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.