కుభీర్ మండల కేంద్రానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు గోరేకర్ కమల్ దాస్ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. కమల్ దాస్ సుమారు రెండున్నర దశాబ్దాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగారు. ఆయన వార్తా కథనాలు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలిచాయి. ఎన్నో సమస్యలను వెలికి తీసి ప్రజలకు న్యాయం కలిగించిన ఆయనకు ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం తెలిపారు.