కుంటాల మండలం విట్టపూర్ గ్రామంలో డీపీఓ శ్రీనివాస్ మండల ప్రజా పరిషత్ అధికారులతో కలిసి గురువారం సందర్శించారు. ప్రజాపాలనలో భాగంగా లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణాలను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఏపీఓ నవీన్, పంచాయతీ కార్యదర్శి ఉత్తమ్, తదితరులు పాల్గొన్నారు.