నిర్మల్ జిల్లా భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టు వివరాలను అధికారులు బుధవారం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 358.70 అడుగులు ఉండగా ప్రస్తుతం నీటిమట్టం 355.50 అడుగులు ఉందని పేర్కొన్నారు. గడచిన 24 గంటల్లో కురిసిన వర్షానికి ఎగువ నుండి ప్రాజెక్టులోకి 250 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందన్నారు. మిషన్ భగీరథకు 20 క్యూసెక్కుల నీరు వదులుతున్నట్లు వెల్లడించారు.