లోకేశ్వరం మండలంలోని పుస్పూర్ గ్రామంలో బీరప్ప ఆలయ నిర్మాణానికి ముధోల్ పవార్ రామారావు పటేల్ భూమి పూజ చేశారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వేద పండితుల మంత్రం, శరణుల మధ్య శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. కుర్మ సంఘం వారి ఆరాధ్య దైవం అయిన బీరప్ప స్వామి మందిరమని పేర్కొన్నారు. అనంతరం కూర్మ సంఘం సభ్యులు ఎమ్మెల్యేకు శాలువతో సత్కరించారు. మండల బిజెపి కార్యకర్తలు, సంఘ సభ్యులు తదితరులు ఉన్నారు.