అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

64చూసినవారు
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
ప్రైవేటు ఫైనాన్స్ లో చేసిన అప్పులు తీర్చలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన భైంసా పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ ప్రదీప్ వివరాల ప్రకారం గోపాల్ నగర్ కు చెందిన రాజేశ్ (39)ఏడాది క్రితం ప్రైవేట్ ఫైనాన్స్ లో టాటా మ్యాజిక్ వాహనం కొనుగోలు చేశాడు. ఈఎంఐలు సక్రమంగా చెల్లించకపోవడంతో రెండురోజుల కిందట ఫైనాన్స్ సిబ్బంది హెచ్చరించి వెళ్లిపోయారు. దీంతో మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్