అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన లొకేశ్వరం మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పొలీసుల వివరాల ప్రకారం సేవాలాల్ తండాకు చెందిన పవార్ కృష్ణ (28) మద్యానికి బానిసై అప్పులు చేశాడు. అప్పులు తీర్చలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య అశ్విని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ దిగంబర్ తెలిపారు.