టీచర్ కొలువులకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కొరకు బైంసా పట్టణంలో మోహన్ రావు ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో వచ్చేనెల 7వ మోడల్ పరీక్షను నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలు పేర్కొన్నారు. ఎస్జిటి అభ్యర్థుల కోసం అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీలతో తయారు చేయించిన మోడల్ టెస్ట్ కు హాజరయ్యే అభ్యర్థులు ఈనెల 28 నుండి వచ్చే నెల 5 వరకు పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. మోడల్ టెస్ట్ ఉదయం10 నుండి మధ్యాహ్నం 12: 30ల వరకు జరుగుతుందన్నారు.