నర్సాపూర్ మండలం హనుమాన్ తండా గ్రామానికి చెందిన రాథోడ్ దినేష్ ఇల్లు గత కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు షాట్ సర్క్యూట్ తో కాలిపోయింది. సమాచారం తెలుసుకున్న మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ ఛైర్మెన్ భోస్లే మోహన్ రావు పటేల్ బాధిత కుటుంబీకులను పరామర్శించి బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో మోహన్ రావ్ పటేల్ తక్షణ సహయం క్రింద నిత్యావసర సరుకులు అందించారు.