నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో లబ్ధిదారులకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని గురువారం లబ్ధిదారులు ఎమ్మెల్యే రామారావు పేటల్ వినతిపత్రం అందజేశారు. సంవత్సరం క్రితం డ్రా ద్వారా ఇళ్లను కేటాయించి ఇప్పటి వరకూ అప్పగించలేదని ఇంటి అద్దెలు చెల్లించలేక అవస్థలు పడుతున్నామని అన్నారు. నీరు, డ్రైనేజీ వసతులు కల్పించి వెంటనే అధికారులు ఇండ్లను అప్పగించాలని కోరారు.