కుంటాల మండలంలోని అందాకూర్ గ్రామ శివారులో సాగు చేసిన సోయా పంటను గురువారం ఏఈఓ గణేశ్ పరిశీలించారు. పంటను కాండం తొలుచు పురుగు ఆశిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కార్బోఫ్లూరాన్ 3జీ గుళికలు ఎకరాకు 8కిలోలు ఇసుకతో కలిపి వెదజల్లాలని ఏఈఓ రైతులకు సూచించారు.