కుంటాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సోమవారం మహాజన సభ నిర్వహిస్తున్నట్లు సీఈఓ నాగభూషణ్ తెలిపారు. రైతు భరోసా పథకంపై రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమం రైతు వేదికలో కొనసాగుతుందని, ఉదయం 11 గంటలకు రైతులందరూ తప్పకుండా హాజరు కావాలని కోరారు.