బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వహించిన విజయ రామారావు బదిలిపై నిజామాబాద్ జిల్లా దేవాదాయశాఖ సహాయ కమిషనర్ గా బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా గురువారం ఆయన కార్యాలయంలో సరస్వతి అమ్మవారి ఆలయ వైదిక బృందం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ పాటక్, సంజీవ్ పూజారి, నవీన్ శర్మ, ఏఈఓ సుదర్శన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.