అవకాశాల కోసం ఎదురుచూడకుండా మనమే సృష్టించుకోవాలని వ్యక్తిత్వ వికాస నిపుణులు వాడేకర్ లక్ష్మణ్, తోట లక్ష్మణ్ సూచించారు. మంగళవారం కుంటాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పించారు. పట్టు దలతో ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానంలో నిలవాలని పేర్కొన్నారు. ఇన్చార్జి హెచ్ఎం చంద్రనా, శ్రీకాంత్, కళాశాల ఇన్చార్జి కార్గాం వినోద్ తదితరులు పాల్గొన్నారు.