గడిచిన 10 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధిని చూసి వచ్చే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి అత్రం సక్కుకు ఓటు వేయాలని నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యురాలు పడగంటి రమాదేవి అన్నారు. శనివారం తానూర్ మండలంలోని కార్బలా గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేద బడుగు ప్రజల అభివృద్ధికి ఎంతో కృషి చేసిందని ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.