టీ-20 వరల్డ్ కప్ గెలుచుకున్న భారత క్రికెట్ జట్టుకు బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆదివారం అభినందనలు తెలిపారు. టోర్నీ ఆద్యంతం సమిష్టి కృష్టితో భారత జట్టు విజయాలు సాధించిందన్నారు. కృషి, పట్టుదలతో మరో గొప్పగెలుపు సొంతం చేసుకున్నారని ప్రశంసించారు. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో ఒత్తిడిని జయంచి సగర్వంగా ప్రపంచకప్ సాధించి పెట్టిన భారత క్రికెటర్లకు శుభాకాంక్షలు తెలిపారు.