ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని హర్శిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గురువారం సంబరాలు చేసుకున్నారు. మినీ ట్యాంక్ బండ్ అంబేద్కర్ చౌక్ వద్ద కేక్ కట్ చేశారు. వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ చేసిన పోరాటం ఫలించిందని అన్నారు. ఇందులో ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.