గొలుసుకట్టు చెరువులను కాపాడాలి

67చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని గొలుసు కట్టు చెరువులను కాపాడాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు అంజూ కుమార్ రెడ్డి అన్నారు. చెరువుకు దరువు-వరదకు అడ్డు అనే కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని గొలుసు కట్టు చెరువులను గురువారం సందర్శించారు. చారిత్రాత్మకమైనటువంటి చెరువుల అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా రియల్టర్లు విచ్చలవిడిగా చెరువు భూములను ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. వెంటనే చెరువులను బౌండరీ లైన్ ఏర్పాటు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్