బాసర సరస్వతి అమ్మవారి సన్నిధిలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజు, పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో భక్తులు తరలి వచ్చి దర్శించుకుంటున్నారు. పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.