నిర్మల్లో పాత్రికేయుల ఆందోళన.. జిల్లా కలెక్టర్కు వినతి
ఎడిటర్స్ ధనుంజయ రెడ్డిపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను చేపట్టడాన్ని నిరసిస్తూ నిర్మల్ లో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం పాత్రికేయులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కు వినతి పాత్రని అందజేశారు. పాత్రికేయులంతా ముక్తకంఠంతో ఉండి ఇలాంటి ఘటనలను ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలురు పాత్రికేయులు పేర్కొన్నారు.