రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రులను ప్రభుత్వం మార్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా జూపల్లి కృష్ణారావును నియమిస్తూ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేసిన సీతక్కను నిజామాబాద్ జిల్లాకు కేటాయించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు లభించిన వివేక్ను మెదక్కు నియమించారు.