సారంగాపూర్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఆడెల్లి పోచమ్మ ఆలయం అవరణలో బుధవారం వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ఆలయ ఆవరణలో సారంగాపూర్ ఎస్సై శ్రీకాంత్ మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి జీవనం మనుగడను రక్షించుకోవాలని సూచించారు. ఇందులో ఆలయ సీనియర్ అసిస్టెంట్ రమణ, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.