తల్లిపాలు శిశువుకు రోగనిరోధక శక్తిని పెంచుతాయని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీదేవి అన్నారు. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని బుధవారం హైదరాబాదు నుండి వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్ పాల్గొన్నారు. ఆగష్టు 1 నుండి 7 వరకు తల్లి పాల వారోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.